శ్రీశైలం పాలకమండలి సభ్యులను సన్మానించిన ప్రభుత్వ చీఫ్ విప్ జివి..

అక్టోబర్ 22 వినుకొండ : రాజధాని వాయిస్

శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియమితులైన బోడేపూడి వెంకట సుబ్బారావు మరియు శంకర శెట్టి పిచ్చయ్య లను ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులును వినుకొండలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బోడేపూడికి, పిచ్చయ్యకి ప్రభుత్వ చీఫ్ విప్ జివి ప్రత్యేక అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares