పరామర్శ
రాజధాని వాయిస్: మాచర్ల.
మాచర్ల నియోజకవర్గంలో ఏపీడబ్ల్యూజే, సీనియర్ పాత్రికేయుడు ఎమ్మెస్ నాగేశ్వరరావు,ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి స్వగ్రామానికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక పాత్రికేయులు ఏపీడబ్ల్యూజే,యూనియన్ అధ్యక్షుడు శ్రీరామమూర్తి ఆయనను పరామర్శించి ఆరోగ్య క్షేమాలను అడిగి ఆయనకు ధైర్యం చెప్పి యూనియన్ తరపున కొంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించారు.అనంతరం ఎమ్మెస్ నాగేశ్వరరావు,మాట్లాడుతూ, తనకు ఆరోగ్యం బాలేదని తెలిసి పాత్రికేయులు ఆర్థిక సహాయాన్ని అందించటం తనకు ఎంతో ఆనందాన్ని, కలిగించిందని
కష్టకాలంలో యూనియన్ ద్వారా ధైర్యాన్ని భరోసానిస్తూ ఐకమత్యంగా ముందుకు సాగడం సంతోషకరమన్నారు . రానున్న రోజుల్లో యూనియన్ కి తనవంతు సహాయ సహకారాలకు తోడ్పడుతానని నాగేశ్వరావు అన్నారు .



Post Comment