నేర నియంత్రణ,శాంతి భద్రతల పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా కార్డెన్సె సెర్చ్ ఆపరేషన్లు
46ద్విచక్రవాహనాలు..
బరిశెలు, ఖాళీ సీసాలు స్వాధీనం
అసాంఘీక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా..
సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు
రాజధాని వాయిస్:ముప్పాళ్ల.అక్టోబర్ 24
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధి మాదల గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆద్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో గ్రామంలో సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, కర్రలు, బరిసెలు, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పాత కేసుల నిందితులతో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని వారి మీద కఠినమైన చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి టౌన్ సిఐఎన్.నాగమల్లేశ్వర రావు, రూరల్ సిఐ.కిరణ్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



Post Comment