దూసుకొస్తున్న మంతా తుఫాన్

 

రాజధాని వాయిస్:

అక్టోబర్ 24,అమరావతి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని ఏపి ఎస్డిఎంఎ తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మంతా తుఫాన్ గా బలపడే అవకాశం ఉందంది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్రలో శనివారం , ఆదివారం రోజులలో భారీ నుండి అతిభారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలు ఎత్తెన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.

Post Comment

You May Have Missed

0Shares